బిచ్కుంద, ఫిబ్రవరి 21: జుక్కల్ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో రూ.36లక్షలతో రైతు సేవా సహకార సంఘం ఆవరణలో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని బుధవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాల్చర్ రాజు, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలు, వైస్ చైర్మన్ యాదారావు తదితరులు పాల్గొన్నారు.