కామారెడ్డి, జనవరి 23: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన అధ్యాపకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో ఏండ్లుగా సేవలు అందించి రిటైర్ అయిన తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు అందరూ సమావేశం కావడం ఆనందదాయకమన్నారు.
కళాశాల ఏర్పడి 60 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపుగా 70 మంది ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు ఒక చోట చేరడం సంతోషమన్నారు. అనంతరం రాశివనంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య,అధ్యాపకులు చంద్రకాంత్, శంకర్, రాజ్గంభీర్, పూర్వ అధ్యాపకుడు రంజిత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.