ఈ నెల 3నఆర్మూర్లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభకు తరలిరావాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆహ్వానించారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందించారు.
ఆర్మూర్టౌన్, అక్టోబర్31: ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 3న సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి మంగళవారం వివిధ కుల సంఘాల పెద్దలకు అందజేశారు. కేసీఆర్ బహిరంగ సభకు అన్ని కులాల ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్, సంజయ్సింగ్బబ్లూ, పోల సుధాకర్, పార్టీ నాయకులు, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.