ఎల్లారెడ్డి, జూలై 18 : మతిలేని ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా రైతుల గురించి పార్లమెంటులో మా ట్లాడలేదని, గంట కరంటుతో ఎకరం పంట పండుతుందని రైతులకు అన్యాయం చేయడానికి పూనుకుంటున్నాడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ రైతు వేదికలో మంగ ళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులకు 24 గంటల కరంటు ఇస్తేనే ఏడాదికి మూడు పంటలు పండించి రైతు రాజు అవుతాడని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తే, చంద్రబాబు శిష్యరికంలో రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడన్నారు. యా సంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఒక్క రోజు కూడా పార్లమెంటులో నోరువిప్పని రేవంత్ ఇప్పుడు రైతుల కడుపుకొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీనారాయణ, లింగంపేట వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సిద్దారెడ్డి, రైతులు పాల్గొన్నారు.