డిచ్పల్లి/ ఇందల్వాయి, మార్చి 19 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంగళవారం పరిశీలించారు. డిచ్పల్లి మండలం సుద్దులం, కోరట్పల్లి, ఇందల్వాయి మండలం నల్లవెల్లి, గన్నారం, స్టేషన్తండా, సిర్నాపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ముప్పా గంగారెడ్డి, శేఖర్గౌడ్, మండల అధ్యక్షులు నవీన్గౌడ్, భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు.