బాన్సువాడ, ఫిబ్రవరి 25: జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ సింగూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పైపులైన్కు లీకేజీ ఏర్పడడంతో మరమ్మతులు చేపట్టనున్నట్లు మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్గౌడ్ తెలిపారు.
మరమ్మతుల నేపథ్యంలో సోమవారం నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాన్సువాడ,జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డి నియోజక వర్గ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.