భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి వెళ్లే రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మిస్తున్న పనులను, సెంట్రల్ లైటింగ్ పనులను శనివారం రాష్ట్ర రోడ్డు భవనాలు గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రూ. 2.64 కోట్లతో మెయిన్ రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులతోబాటు రూ. 70లక్షలతో చేపట్టనున్న గిరి ప్రదక్షిణ రోడ్డును పరిశీలించారు. పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు.
జాతర సమీపిస్తున్నందున కూలీల సంఖ్యను పెంచి ఇరవైనాలుగు గంటల పాటు పనులు చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.