వంద పడకల దవాఖానకు శంకుస్థాపన
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
భీమ్గల్, జూన్ 13: మండల కేంద్రంలో వంద పడకల దవాఖానను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇందుకోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ నెల 18న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నాయకులు, అధికారులతో చర్చించారు. అనంతరం బహిరంగ సభాస్థలిని పరిశీలించి పలు సూచనలు చేశారు. భూమిపూజ పనుల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి వెంట డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ రాజేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.
మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
టీఆర్ఎస్లో వలసలు కొనసాగుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట గంగాధర్, బూరెడి శ్రీనివాస్, నంగి జలంధర్, ఈదప నరేశ్ తదితరులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులను మంత్రి అభినందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమం దేశ వ్యాప్తంగా కావాలని ఆయా రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారని అన్నారు. యావత్ భారతదేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని మంత్రి అన్నారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, శర్మానాయక్, ముచ్కూర్ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజేశ్వర్, ఉప సర్పంచ్ భూమేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.