ఆర్మూర్ : ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోని బాధితులకు మంజూరైన 80 సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారికి అందజేశారు.
ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ దఫా 80 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయించడం పట్ల సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో పలు కారణాలతో దవాఖానల్లో చికిత్స పొంది రూ. 5 వేలకు మించి ఉన్న ఆస్పత్రి బిల్లులను ఆర్మూర్లోని తన కార్యాలయంలో అందజేస్తే వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయిస్తానన్నారు. జీవన్రెడ్డిని కలిసిన వారిలో మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ తాటి హన్మాండ్లు, టీఆర్ఎస్ నాయకులు కొట్టాల మోహన్, ఆకుల శ్రీనివాస్, కొట్టాల సుమన్ తదితరులున్నారు.