రాష్ట్రంలో 15 మందికి కొత్త వేరియంట్ జేఎన్-1ను గుర్తించారు. ఇప్పటికే కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చలికాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే వైరస్ వ్యాప్తిని అరికట్ట వచ్చని వైద్యులు తెలుపుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యసిబ్బంది అప్రమత్తమైంది. ఐసీయూ, వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచారు. కొవిడ్ను ఎదుర్కొనేందుకు నూతన వార్డును ఏర్పాటు చేశారు. కొవిడ్ టెస్టుల కోసం ప్రత్యేకంగా వెనుకభాగంలో ఓపీని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
జ్వరం, జలుబు, గొంతు స మస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరికలు చేయడంతో జనంలో ఆందోళన నెలకొన్నది. మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు. చలి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 10 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు కడుక్కోవాలని, తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయాలంటున్నారు. విం దులు, వినోదాలను తగ్గించుకోవాలని తెలుపుతున్నారు.జ్వ రం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస లో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇం టి లోపల వెచ్చని వాతావరణం ఉండేలా చూసుకోవాలని, వీలైనంతగా పిల్లలు,వృద్దులు ఉన్ని దుస్తులను ధరించాలి.
కరోనా అంటేనే ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతున్నది. 2020-21లో రెండు సార్లు ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. కరోనా వైరస్ వలన చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. వైరస్ నివారణకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్, బూస్టర్ డోస్
ఇప్పించింది. దీంతో కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మళ్లీ కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న వార్తలు కలవర పెడుతున్నాయి. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
రద్దీ ప్రాంతంలో మాస్క్ ధరించాలి
కరచాలనం చేయకుండా నమస్కారం చేయడమే మేలు
చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి
తుమ్మినా దగ్గినా నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి
జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి
ప్రతి రోజు గోరువెచ్చని నీటిని తాగాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
అనుమానిత లక్షణాలు ఉంటే కరోనా నోడల్ కేంద్రాన్ని ఆశ్రయించాలి
నిజామాబాద్ జీజీహెచ్లో కొవిడ్ వైద్యం కోసం సర్వం సిద్ధం చేశాం. ప్రజ లు భయపడాల్సిన అవసరం లేదు. కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. బెడ్లు, ఐసీయూ, జనరల్ వార్లును సిద్ధం చేశారు. మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు.
కరోనా కొత్త వేరియంట్ కేసులు న మోదవుతున్నందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. కరోనా తాత్కాలిక మైన జలుబు లాంటిది, తగిన జాగ్రత్తలు, వైద్య సలహాలు, సూచనలు పాటిస్తే కరోనాను తరిమికొట్టవచ్చు. కరోనాను అందరం కలిసి కట్టుగా పోరా డి జయించాలి.