నమస్తేతెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 22 : గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, గురుకుల, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో గురువారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించారు.
ధర్పల్లి మండలంలోని ధనంబండ (డీబీ) తండా ప్రభుత్వ పాఠశాలలో జిల్లాలో మొదటిసారిగా టీఎల్ఎం మేళాను గురువారం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా జిల్లా నోడల్ ఆఫీసర్ నర్రా రామారావు హాజరై మేళాను ప్రారంభించారు. గణితశాస్త్ర బోధన పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నోడల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. డీబీ తండా ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం గంగా సావిత్రి, ప్రధానోపాధ్యాయుడు వెంకటరాజారెడ్డి, సర్పంచ్ నరేందర్, ఎస్ఎంసీ చైర్మన్ మోహన్ పాల్గొన్నారు. ధర్పల్లిలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో విద్యార్థులు గణిత శాస్త్ర ఎగ్జిబిషన్ను నిర్వహించారు. గణిత శాస్త్ర అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.
సిరికొండ మండలంలోని ఆశ్రమ పాఠశాల, సత్యశోధక్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. సత్యశోధక్ పాఠశాలలో ఇన్చార్జి ఎంపీడీవో లక్ష్మీప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై గణితంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి హైస్కూల్లో ‘మ్యాథమేటిక్స్ పనోరమ’ నిర్వహించారు. బోధన్ మండల విద్యాధికారి నాగనాథ్ శ్రీనివాస రామానుజన్, సరస్వతీ దేవి, గణిత మేధావి ఎస్వీ సుబ్రహ్మణ్యశాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బాల్కొండలోని మైనార్టీ పాఠశాలలో 1, 2, 1 ఆకారాల్లో విద్యార్థులు కూర్కొని ప్రదర్శన నిర్వహించారు.
భీమ్గల్లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల, సరస్వతి విద్యా మందిర్ పాఠశాలల్లో మ్యాథమెటిక్స్ డే నిర్వహించారు.
మోర్తాడ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గణితంలో వివిధ పోటీలు నిర్వహించారు. మోర్తాడ్లోని బాలికల ఉన్నత పాఠశాలలో రామానుజన్ నంబర్ 1729 ఆకారంలో కూర్చున్నారు.
మాక్లూర్ మండలంలోనని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. దాస్నగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో విజ్ఞాన్ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన గణిత పరికరాల ఆకృతులు (+ – X . *) ఆకట్టుకున్నాయి.
కమ్మర్పల్లి మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు గణితశాస్త్ర ప్రత్యేకతపై అవగాహన కల్పించారు. గణితశాస్త్ర సంబంధ అంకెల రూపంలో విద్యార్థులు కూర్చొని ప్రదర్శననిచ్చారు.
రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన, రంగొళీ, క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన గణిత ప్రాజెట్టుకు ఆఅకట్టుకున్నాయి.