డిచ్పల్లి/ ధర్పల్లి/ ఇందల్వాయి/ మోస్రా (చందూర్)/మాక్లూర్/భీమ్గల్/ మోర్తాడ్/ వేల్పూర్/ ముప్కాల్, ఫిబ్రవరి 8 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని మండల అధికారులు అన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేపట్టారు. పనులను అధికారులు పరిశీలించారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బీ)లో చేపట్టిన పనులను మండల ప్రత్యేకాధికారి రాజేందర్, ఎంపీడీవో గోపీబాబు పరిశీలించారు. ధర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో లక్ష్మణ్ చెత్తను ట్రాక్టర్తో శుభ్రం చేయించారు. చెరువు కట్ట ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను శుభ్రం చేయించారు.
ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లిలో పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో రాములునాయక్ పరిశీలించారు. మోస్రా మండలకేంద్రంలో పంచాయతీ సిబ్బందికి అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలని ఎంపీవో రఫీ సూచించారు.
మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో అధికారులు, గ్రామస్తులతో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. భీమ్గల్ మడలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
మోర్తాడ్ మండలంలో ప్రత్యేకపారిశుద్ధ్య వారోత్సవాలు కొనసాగాయి. మోర్తాడ్లో పైప్లైన్ లీకేజీలకు సిబ్బంది మరమ్మతు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ఆవరణలను శుభ్రం చేశారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య వారోత్సవాలు కొనసాగుతున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని అధికారులు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామంలోని ప్రధాన రోడ్లుపై, పలు కాలనీల్లో చెత్తను తొలగించారు.