ఇందల్వాయి, డిసెంబర్ 25: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి గన్నారం శివారులోని బ్రహ్మంగారి ఆలయం వద్ద ఓ కారును లారీ వెనుకనుంచి ఢీకొట్టడంతో పొద్దుటూరి విజయ (54) మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వివరాలు.. నిజామాబాద్ నగరంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన పొద్దుటూరి నాగేంద్ర కరుణ్రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తన భార్య పొద్దుటూరి విజయకు వైద్య పరీక్షలు చేయించుకొని కారులో ఆదివారం మధ్యాహ్నం తిరిగి బయల్దేరారు.
మార్గమధ్యంలో గన్నారం బ్రహ్మంగారి ఆలయం వద్ద కారును అతివేగంతో వస్తున్న లారీ ఢీకొట్టడంతో విజయకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి ఎస్సై చేరుకొన్నారు. క్షతగాత్రులను జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో విజయ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. భర్త నాగేంద్రకు స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు చెప్పారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.