కార్తిక మాసం.. చివరి సోమవారం.. శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తిక దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. కందకుర్తి వద్ద నిర్వహించిన గంగాహారతికి భక్తులు పోటెత్తారు.
రెంజల్, డిసెంబర్ 11 : మండలంలోని కందకుర్తి గోదావరినదిలో కార్తిక మాసం చివరి సోమవారం మహాహారతి కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాల్గో పుష్కర ఘాట్పై అయోధ్య, కాశీ, హిమాచల్ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పుష్కర ఘాట్పై లక్షదీపోత్సవం అర్చకుడు ప్రవీణ్ మహరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.