హైదరాబాద్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ (Indian Institute of Health and Family Welfare) గా నియమితులైన డాక్టర్ బద్ధం మధుశేఖర్ (Madhu Shekhar) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) ను శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనను చైర్మన్గా నియమించినందుకు సీఎం కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం భీంగల్కు చెందిన డాక్టర్ మధుశేఖర్ ఆర్మూర్ పట్టణంలో గత మూడు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేస్తు పార్టీకి సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో చైర్మన్గా నియమించినందుకు ఆ పదవిని సమర్ధవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఉన్నారు.