బోధన్/కోటగిరి/ మోస్రా/ బాల్కొండ/ భీమ్గల్/ మాక్లూర్/ నవీపేట/రెంజల్, డిసెంబర్ 1: ఎయిడ్స్ దినం సందర్భంగా గురువారం జిల్లాలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్-1 యూనిట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నిక్కత్ కౌసర్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పెద్దపల్లి శ్రీనివాస్, అధ్యాపకులు మోసిన్, జగదీశ్, శ్రీనివాస్, మాజీద్ పాల్గొన్నారు.
పొతంగల్తో పాటు కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధికారులు అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మోస్రా మండల కేంద్రంలో పీహెచ్సీ పరిధిలోని వైద్య బృందం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యుడు రాజ్కుమార్, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాల విద్యార్థులు ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఎయిడ్స్ గుర్తు ఆకారంలో కూర్చున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని ఎన్ఎస్ఎస్ 1, 2 యూనిట్ల ప్రోగ్రాం అధికారులు వి.కృష్ణదాస్, జి.సాయికుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అబ్బా చిరంజీవి ఆధ్వర్యంలో భీమ్గల్లో ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలం దాస్నగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.సరిత, ప్రిన్సిపాల్ కె.లావణ్య, అధ్యాపకులు పాల్గొనానరు.
నవీపేట మండల కేంద్రంలో చైల్డ్ ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరిపె మల్లేశ్, నాయకులు నీరడి బుచ్చన్న, ఐకేపీ ఏపీఎం భూమేశ్వర్గౌడ్, బాలుర పాఠశాల ఇన్చార్జి ఎచ్ఎం సురేఖ, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ రవి, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్యం సిబ్బందితో ర్యాలీ నిర్వహించినట్లు మండల వైద్యాధికారిణి ప్రమోదిత తెలిపారు. హెచ్ఈవోలు కరిపె రవీందర్, శ్రావణ్కుమార్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.