ఖలీల్వాడి, డిసెంబర్ 4: జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లహరి ఇంటర్నేషనల్ హోటల్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెట్టుబడులకు స్వర్గధామంగా నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందినట్లు తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు బాగుండడంతో వివిధ కంపెనీలు క్యూ కడుతున్నాయన్నారు. నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నగరవాసులకు సరికొత్త రుచులు, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు స్వాగతం పలుకుతున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, హోటల్ నిర్వాహకులు తిరుపతిరెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.