Kotagiri | కోటగిరి, జూలై 24 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని సర్కార్ దవఖానలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకుడు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ జనం మెచ్చిన నేత, జనం కోసం తపించే నాయకుడు కేటీఆర్ ఆని కొనియాడారు. తెలంగాణ ప్రజల అభ్యుదయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు కేటీఆర్ అని గుర్తు చేశారు.
వర్షాభావ పరిస్థితులు, పేపర్ లీక్ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాదులో ఇందిరా పార్కువద్ద నిర్వహించే ధర్నా సందర్భంగా జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకోవద్దని కేవలం సామాజిక కార్యక్రమాలు మాత్రమే చేపట్టాలని ఆదేశాలు ఇవ్వటం వల్ల తాము కూడా అయన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, సీట్లు పంపిణీ చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్, శంకర్ గౌడ్, నజీర్, సమీర్, ఏత్తొండ దేవేందర్, మోగులప్ప, కప్ప సంతోష్, చిన్న అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్, మోరే గౌతమ్, గగన్, ఉమాకాంత్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.