బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను బుధవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలామణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, ఎంపీటీసీ రవి, సర్పంచ్ నర్సవ్వ పాల్గొన్నారు.