రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం పరిసరాలను శుభ్రం చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్ర పర్చుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.
కమ్మర్పల్లి, జూలై 31: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి వేముల ఆదివారం హైదరాబాద్లో మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో పరిసరాలను శుభ్రం చేశారు.
కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి స్వయంగా తన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ ఇంటి ఆవవరణలో నీటి నిల్వతో డెంగీ తదితర వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంటుందన్నారు. మంత్రితోపాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.