స్పష్టం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు స్వతంత్ర భారతావనిలో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో సర్వం వెనుకబడింది. భారత్ను విశ్వ గురువుగా మారుస్తామంటూనే విద్వేషాలను రెచ్చగొట్టే సంస్కృతి తీసుకొచ్చారు. కుల, మతాల పేరిట మంటలు రాజేసే రాక్షస క్రీడకు తెర లేపారు. ఈ నేపథ్యంలో స్వార్థ రాజకీయాలను రూపుమాపి దేశానికి సరికొత్త మార్గదర్శనం చేసే నాయకుడి కోసం జాతి ఎదురుచూస్తున్నది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేళ భారతావనిని జాగృతం చేసే బాధ్యతను చంద్రశేఖరుడు తలకెత్తుకోవాలని యావత్ దేశం ఆకాంక్షిస్తున్నది. సకల జనుల సమస్యలపై అవగాహన ఉన్న సంక్షేమ సారథి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని సబ్బండ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. దేశభక్తి, దైవభక్తి మెండుగా ఉన్న నాయకుడు, ప్రజా సంక్షేమం కోసం తపనపడే సమర్థుడైన కేసీఆర్తోనే దేశానికి రక్ష అని పేర్కొంటున్నాయి.
ఆర్మూర్, సెప్టెంబర్ 13: దేశంలో ప్రస్తుతం ధర్మం పేరిట అధర్మం రాజ్యమేలుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రదాత అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఉద్యోగులు ముక్తకంఠంతో కోరుతున్నారు. దేశభక్తి, దైవభక్తి మెండైన నాయకుడు.. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే సమర్థుడైన కేసీఆర్తోనే దేశానికి రక్ష అని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఒక్కడై బయల్దేరి.. సబ్బండవర్గాలతో కలిసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తీరుతెన్నులను దేశం గమనించింది. కొత్త రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాల్లోకి వస్తే భారతదేశ దశ, దిశలో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నది. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల నుంచి వలస వస్తున్న కార్మికుల్లో సైతం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ మత విద్వేష, రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనని రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్తో నాయకత్వంలోనే దేశంలో సమూల మార్పులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ, 10 శాతం డీఏలను అందించి కొండంత భరోసా నింపారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం బయల్దేరుతున్న కేసీఆర్ వెంట మేమూ నడుస్తామంటూ నినదిస్తున్నారు.
లింగంపేట, సెప్టెంబర్ 13: ఆజ్ దేశ్కో కేసీఆర్ సాబ్కా జరూరత్ హై, దేశ్కే కిసాన్, నార్మల్ పబ్లిక్కే లియే తెలంగాణమే బహుత్ సారే స్కీం చలారే. అప్నే తెలంగాణకా స్కీమ్ పూరా దేశ్ కో చాహియే. కేసీఆర్ సాబ్ సెంట్రల్కు గయేతో హర్ ఆద్మీకో అప్నె స్కీంకా ఫాయిదా మిల్తా. తెలంగాణ ఆనేకే బాద్ బహుత్ కుషహలిసే హై, పూరా దేశ్మే కుషాలి హోనా హై. నిజామాబాద్ మీటింగ్ మే ఫ్రీ కరెంట్ దేనేవాలే హై బోలేకే అనౌన్స్ కరే. బహుత్ బడి బాత్ హై. అబ్తక్ ఐసే బాత్ కోయి లీడర్ నహి బోలా. ఏ స్టేట్మెంట్ దేశ్మే సబ్కో సోచ్మే డాలా. దేశ్కే కిసీబీ స్టేట్మే ఫ్రీ కరెంట్ నహి దే రహెహై. కేసీఆర్ సాబ్ సెంట్రల్మే సబ్కో ఫ్రీ కరెంట్ దేతే బోల్కే బడి బాత్ బోలే. తెలంగాణామే హర్ గర్మే చహెరెపే ముస్కరాపన్ దిక్తాహై. ముస్కరాపన్ దేశ్మే ఆనా బోలేతో కేసీఆర్ సాబ్ సెంట్రల్కు జానా కంపల్సరి హై.
-నసీమోద్దీన్, విశ్రాంత ఉద్యోగి, లింగంపేట
సకల ఉద్యోగులకుజీతాలు పెరిగాయి
రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్. రాష్ట్రం సిద్ధించిన తర్వాత సకల ఉద్యోగులకు జీతాలు పెంచారు. అంగన్వాడీ, ఆశ, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీసీ, వీవోఈ, కాంట్రాక్ట్ లెక్చరర్, హోంగార్డ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలను మూడింతలు పెంచిన నాయకుడు కేసీఆరే. మాలాంటి ఉద్యోగ విరమణ పొందిన వారికి పింఛన్లు, ఇంక్రీమెంట్లు పెంచారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశ ప్రజలకు అందాలంటే జాతీయ రాజకీయంలోకి కేసీఆర్ వెళ్లడం అనివార్యం. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు, దేశ్ కీ నేత కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం.
-నాగులపల్లి రామారావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, బొంకన్పల్లి, మాక్లూర్
కేసీఆర్ సేవలు దేశానికి అవసరం
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది న సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అత్యవసరం. కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారు. సబ్బండవర్ణాల ప్రజల కోరిక మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, పీఆర్సీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కేసీఆర్ దేశ రా జకీయాల్లో ప్రవేశిస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షే మ పథకాలు దేశమంతా వర్తింపజేసే అవకాశమున్నది. తెలంగాణ తెచ్చిన ఘనుడు.. సీఎం కేసీఆర్తోనే దేశాన్ని బాగు చేయడం సాధ్యమవుతుంది.
– సీహెచ్.గంగాధర్, సీనియర్ సిటిజన్ ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి
దేశ రూపురేఖలు మారుతాయి
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం తప్పనిసరి పరిస్థితిగా ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆరే. దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా కేసీఆరే కనబడుతున్నారు. దేశ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయం. ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కొండంత అండ. ప్రధానిగా ఎన్నికైతే దేశవ్యాప్తంగా ఉద్యోగులకు భరోసా ఏర్పడుతుంది. అన్ని రాష్ర్టాల్లో 61ఏండ్లకు రిటైర్మెంట్ వయస్సును పెంచుతారు. తెలంగాణ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా కేసీఆర్ అమలు చేస్తారు. ప్రస్తుత తరుణంలో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడితే.. దేశ రూపురేఖలు మారిపోతాయి.
– పెరుమాండ్ల గంగాధర్, రిటైర్డ్ ఎస్సై, వల్లభాపూర్, మాక్లూర్
కేసీఆర్కు తిరుగుండదు..
దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తే కేసీఆర్కు తిరుగుండదు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో సక్సెస్ఫుల్ మోడల్గా నిలిపిన ఘనత కేసీఆర్దే. రాష్ట్రం ఆవిర్భావమయ్యాక ఎనిమిదేండ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ మోడల్ను దేశమంతా విస్తరించి అన్ని రాష్ర్టాల్లో అమలు చేయించాలి. కేసీఆర్ జాతీయ పార్టీకి మా రిటైర్డ్ ఉద్యోగులందరం సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లో 100 శాతం రాణిస్తారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు ఎంతో అవసరం. మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ 30 శాతం పీఆర్సీని ఇవ్వడంతోపాటు 10 శాతం కరువు భత్యాన్ని ఇచ్చిన ఘనత కేసీఆర్దే.
– జిందం నరహరి, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఆర్మూర్
శుభపరిణామం..
మాక్లూర్, సెప్టెంబర్ 13: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ పరిణామం. తెలంగాణలో అమలవుతున్న పథకాలు అద్భుతం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలందరికీ అందుతాయి. ఫలితంగా సబ్బండవర్ణాల ప్రజలు సంతోషంగా జీవిస్తారు. కేసీఆర్ అవసరం దేశ ప్రజలకు ఎంతైనా అవసరమున్నది. కీలక సమయంలో దేశ రాజకీయాల్లో ప్రవేశిస్తే రాబోయే తరాలకు కేసీఆర్ పథకాలు, ఫలాలు అందుతాయి.
– అనుపల గంగారాం, రిటైర్డ్ ఉద్యోగి, మాదాపూర్, మాక్లూర్
దేశ రాజకీయాలను మార్చే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాలు ఆందోళనకరంగా ఉన్నా యి. ఈ సమయంలో జాతీయ రాజకీయాలను మార్చగల ఏకైక వ్యక్తి కేసీఆరే అనిపిస్తుంది. తప్పకుండా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అవుతారన్న పూర్తి విశ్వాసముంది.
-ముత్తెన్న, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నందిపేట్
దేశ గతిని కేసీఆర్ మార్చగలరు
నందిపేట, సెప్టెంబర్ 13: ప్రస్తుతమున్న వ్యవస్థను కేసీఆర్ మార్చగలరు. దూరదృష్టి కలిగిన నేతగా తెలంగాణ రాష్ర్టాన్ని స్వల్ప కాలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. అదే రీతిలో దేశంలోని వ్యవస్థను సమూలంగా మార్చి అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దగలరనే నమ్మకముంది.
– బోగ గంగాధర్, రిటైర్డ్ ట్రాన్స్కో ఉద్యోగి,నందిపేట్
ముందుచూపున్న నేత కేసీఆర్
భావితరాల బాగుకోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా దేశ రాజకీయాల్లోకి రావాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా భారతదేశ ప్రగతిని ఉరకలెత్తించి అభివృద్ధి పథానికి తీసుకెళ్తాడు. ముందుచూపుతో ఆలోచించే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి జవసత్వాలు తీసుకొచ్చిండు. అలాగే దేశంలోనూ తీసుకొస్తడు.
– గుమ్ముల గంగాధర్, విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆర్మూర్