డిచ్పల్లి, మార్చి 21 : వానకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాల ప్రజలు వాగు దాటాలంటేనే భయపడేవారు. నాలుగు నెలలపాటు వాగుపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించేవారు. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి, ఇందల్వాయి తండా గ్రామాల మధ్య పురాతన చిన్నవాగు ఉంది. ఇటీవలే భారీ వర్షాలకు చిన్నవాగు పూర్తిగా కొట్టుకు పోయి నాలుగు గ్రామాల ప్రజలకు వారది తెగింది. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఇందల్వాయి మీదుగా ఇతర ప్రాంతా లకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడేవారు. దీంతో గ్రామ స్తులు, తండా వాసులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. దీంతో స్పందించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి చిన్నవాగు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించగా రూ.70 లక్షలు మంజూరు చేయించారు. వెంటనే పనులు సైతం ప్రారంభించారు.
అప్పటి వరకు తాత్కాలికంగా బ్రిడ్జి పక్క నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు మట్టిరోడ్డు ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిన్నవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి తే ఇందల్వాయి, ఇందల్వాయి తండా, రంజిత్నాయక్ తండా, గండితండా, త్రియంబక్పేట్ గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. చిన్నవాగు మీదుగా ఇంద ల్వాయి ఇతర గ్రామాల ప్రజలు చంద్రయాన్పల్లి మీదుగా 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి కామారెడ్డి, హైదరా బాద్ ప్రాంతాలకు దూరభారం తగ్గి ప్రయాణం చేసే అవకాశా లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో సాకారమైంది. బ్రిడ్జి నిర్మాణం పనులు చురుగ్గా సాగడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బ్రిడ్జి నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చిన్నవాగు కింద ఉన్న పంటపొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆర్టీసీ చైర్మన్ రైతులతో పేర్కొన్నారు.
ఆర్టీసీ చైర్మన్కు రుణపడి ఉంటాం
ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏండ్ల కల చిన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఐదు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఐదు గ్రామాల ప్రజలు ఆర్టీసీ చైర్మన్కు రుణపడి ఉంటాం.
– చందర్ నాయక్, సర్పంచ్ ఇందల్వాయి తండా
ఆర్టీసీ చైర్మన్ కృషితోనే నిధులు మంజూరు
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషితోనే చిన్నవాగు బ్రిడ్జి నిర్మాణానికి రూ.70లక్షలు మంజూరు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురాతన బ్రిడ్జిలకు, గ్రామాల సీసీ రోడ్లకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు అయ్యాయి.
– మారంపల్లి సుధాకర్, ఎంపీటీసీ