ఖలీల్వాడి/ కామారెడ్డి, ఫిబ్రవరి1: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలకు ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 8,858 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1,345 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి సుదర్శనం తెలిపారు.
ఇప్పటి వరకు మొత్తం 76,331 మందికి కంటి పరీక్షలు చేయగా 40,148 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 5,472 మందికి కంటి పరీక్షలు చేయగా 901 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 43,751 మందికి పరీక్షలు చేయగా 9,107 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.