నాగిరెడ్డిపేట్, జూన్ 10: దళితబంధు పథకం దళితులకు వరమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళిత బంధు కింద మంజూరైన వాహనాలను ఆరుగురు లబ్ధిదారులకు శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. నాలుగు ట్రాక్టర్లు, ఒక టాటా ఏస్, ఒక కారును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో 10 దళిత బంధు యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో ఆరుగురికి యూనిట్లు పంపిణీ చేయగా, మిగతావి ఈ వారంలో అందజేస్తామన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజదాస్, జడ్పీటీసీ మనోహర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోతె శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణ, సర్పంచులు వంజరి సునీత, కిచ్చయ్యగారి సునీత, మురళి, అనుషా, విజితారెడ్డి. ప్రవీణ్, సుభాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు గుర్రాల సుశీల, మాధవి, వినితారెడ్డి, విమలవ్వ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్లో సూపర్ మార్కెట్ ప్రారంభం
సదాశివనగర్, జూన్ 10 : మండల కేంద్రంలో దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధిదారుడు కొమ్ము సాయిలు సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకోగా ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గాదారి అశోక్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, జిల్లా పరిషత్ కో- ఆప్షన్ సభ్యుడు మోహినుద్దీన్, సమతి మండల కన్వీనర్ భూంరెడ్డి, శ్రీకాల భైరవ స్వామి ఆలయ కమిటీ డైరెక్టర్ మర్కంటి బుచ్చన్న, విండో చైర్మన్లు కమలాకర్ రావు, సదాశివరెడ్డి, ఉప సర్పంచ్ వంకాయల రవి తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధుతో ధనికులు కావాలి:బోధన్ ఎమ్మెల్యే షకీల్
బోధన్ రూరల్, జూన్ 10: దళిత బంధుతో దళితులు ధనికులు కావాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. శుక్రవారం బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో దళిత బంధు పథకం కింద లబ్ధిదారుడు ఏర్పాటు చేసుకున్న లక్ష్మి హార్డ్ వేర్ షాప్ను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్, రైతు బంధుసమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న తదితరులు పాల్గొన్నారు.