కామారెడ్డి, జూన్ 10: రాష్ట్రవ్యాప్తంగా ఆడ బిడ్డల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సర్కార్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందిస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన స్వగృహం వద్ద నియోజకవర్గ పరిధిలోని 37 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు సంబంధించి 37లక్షల 4వేల 292 రూపాయల విలువగల చెక్కులను, సీఎంఆర్ఎఫ్కు సంబంధించి రూ.9,22,500 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కుల, మతాలకతీతంగా ఆడపిల్లల పెండ్లిభారం తల్లిదండ్రులపై పడకుండా ఉండేందుకు తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందిస్తున్నారని అన్నారు.
రాష్టంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలో 7,187 మందికి రూ.71కోట్ల 56లక్షల ఒక వేయి 372 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కలను పంపిణీ చేశామని అన్నారు. 1,271 మందికి సీఎం ఆర్ఎఫ్కు సంబంధించి 7కోట్ల 99 లక్షల 49వేల 300 రూపాయలను అందించామని అన్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటే సీఎంఆర్ఎఫ్ కోసం బిల్లులు సకాలంలో సమర్పించాలని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దీన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బీబీపేట ఎంపీపీ బాలమణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, పార్టీ నాయకులు గడ్డం చంద్రశేఖర్రెడ్డి, ముప్పారపు ఆనంద్, కాసర్ల స్వామి, కృష్ణాజీరావు, గెరిగంటి లక్ష్మీనారాయణ, గోపిగౌడ్, వజ్జపల్లి ఆంజనేయులు, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.