కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో రాధాస్వామి సత్సంగ సంస్థ వారు నూతనంగా నిర్మించే ధ్యాన మందిరానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా సాయికృప నగర్లో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించే ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ కమ్యునిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు డి.అంజిరెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.