మద్నూర్ : పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు వస్తాయని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మైథిలీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ మండల నూతన కమిటీ ఎన్నికలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని, మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో లేవని తెలిపారు.
త్వరలో ముఖ్యమంత్రి నాగమడుగు ఎత్తిపోతల పథకానికి భూమిపూజకు రానున్నారని, ఆ సమయంలో నియోజకవర్గానికి 5వేల డబుల్బెడ్ రూం ఇండ్లు మంజురయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దళితబంధులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం ఎంపికైందని, దశలవారీగా అందరికి దళితబంధు పథకం కింద పది లక్షల రూపాయలు వస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ మద్నూర్ మండల నూతన అధ్యక్షుడిగా సంగమేశ్వర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టర్ రాంపటేల్, ఎంపీపీ లక్ష్మిబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, మద్నూర్, బిచ్కుంద్ మండలాల అధ్యక్షులు సంగమేశ్వర్, వెంకట్రావ్ దేశాయి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు దరాస్ సురేశ్, బిచ్కుంద ఎంపీపీ అశోక్పటేల్, నాయకులు అశోక్పటేల్, శంకర్రావు, శివాజి, బస్వరాజ్పటేల్, బాబుపటేల్, పండిత్రావు పటేల్, మోయిన్పటేల్, బన్సిపటేల్, కుశాల్, హన్మంత్ తదితరులు ఉన్నారు.