నాగిరెడ్డిపేట్: జూన్ 28 : ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి కొత్త నీరు వస్తున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం 410 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోని వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల నీరు ఉన్నట్లు డీఈఈ తెలిపారు.
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో ..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న చిన్నపాటి వర్షాలతో రిజర్వాయర్లోకి 3,877 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈఈ రవి తెలిపారు. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 4.248 టీఎంసీల వర్షపు నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1066.50 అడుగుల (22.755 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈఈ వివరించారు.