నమస్తే తెలంగాణ యంత్రాంగం: జిల్లావ్యాప్తంగా పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. తొమ్మిదో రోజైన శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు.
ఎల్లారెడ్డి మండలపరిధిలోని మాచాపూర్, బ్రాహ్మణ్పల్లి గ్రామాల్లో ఎంపీడీవో మల్లికార్జున్రెడ్డి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలకు నీరుపోశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను పొక్లెయిన్ సహాయంతో తొలగించి మొక్కలను నాటారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అతినారపు అరుణ్, ప్రిన్సిపాల్ సాయిబాబా, ఎస్ఎంసీ చైర్మన్ మంచిర్యాల విద్యాసాగర్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 12వ, 2వ వార్డుల్లో స్థానిక నాయకులు, అధికారులు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్ జంగం నీలకంఠం అప్ప, మంచిర్యాల మహేశ్వరి, హార్ట్టికల్చర్ అధికారి లోకేశ్, ప్రత్యేకాధికారి శ్రీకాంత్ కిషన్ పాల్గొన్నారు. ఎర్రమన్నుకుచ్చ కాలనీలో మొక్కలకు కూలీలకు ట్రీగార్డులను సరిగ్గా ఏర్పాటు చేయరాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ ట్రీగార్డులను ఏర్పాటు చేసే విధానాన్ని సూచించారు.
గాంధారి మండలంలోని బూర్గుల్లో పల్లె ప్రగతి పనులను జడ్పీటీసీ సభ్యుడు శంకర్నాయక్, మాజీ జడ్పీటీసీ తానాజీరావుతో కలిసి పరిశీలించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను గ్రామస్తులకు వివరించాలని సర్పంచ్ శివాజీకి సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో సతీశ్, ఎంపీవో రాజ్కిరణ్రెడ్డి పరిశీలించారు.నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూర్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని మండల ప్రత్యేకాధికారి రఘునాథ్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ సౌందర్య పరిశీలించారు. నాగిరెడ్డిపేట్లో ఏర్పాటు చేసిన వైకుంఠధామం ఆవరణలో పిచ్చిమొక్కలను ఎంపీవో శ్రీనివాస్ తొలగించారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజదాస్, సర్పంచులు వంజరి సునీత, కిచ్చయ్యగారి సునీతారెడ్డి, ఎంపీటీసీ మాధవి, ప్రొబేషనరీ ఎస్సై మీనాకుమారి, స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్, తహసీల్దార్ సయ్యద్ అహ్మద్, ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంజీవులు, సిద్ధయ్య పాల్గొన్నారు.రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరేశ్ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు శ్రమదానం నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు.
పల్లె ప్రకృతివనంలో బెంచీల ఏర్పాటు
లింగంపేట మండలం సురాయిపల్లిలోని ప్రకృతివనాన్ని డీఎల్పీవో రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఏర్పాట్లు బాగుండడంతో సర్పంచ్ రాజశేఖర్రెడ్డిని అభినందించారు. దాతల సహకారంతో బెంచీలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సిబ్బంది మొక్కలు నాటారు.
నిజాంసాగర్ మండలంలోని మగ్ధుంపూర్లో సర్పంచ్ లక్ష్మీనారాయణ ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. తాడ్వాయి మండలంలోని దేమెకలాన్ వైకుంఠధామంలో మొరం పనులను మండల ప్రత్యేకాధికారిణి వసంత, ఎంపీవో హప్సిబా పరిశీలించారు. తాడ్వాయిలో రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఎర్రాపహడ్లో మొక్కలకు నీరు పోశారు. బ్రాహ్మణపల్లి, దేవాయిపల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
బాన్సువాడలోని 3వ వార్డులో ప్రధాన రహదారి డివైడర్ల మధ్య మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మొక్కలు నాటారు. పెద్దఫూల్ బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైపులైన్ను పరిశీలించారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ వైస్చైర్మన్ షేక్ జుబేర్, స్పీకర్ పీఏ భగవాన్రెడ్డి ఉన్నారు.
కామారెడ్డి పట్టణంలోని 13, 36వ వార్డుల్లో ఉన్న పార్కుల్లో బల్దియా చైర్పర్సన్ నిట్టు జాహ్నవి మొక్కలను నాటారు. పట్టణప్రగతి చివరి రోజైన శనివారం 8వ వార్డులో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గోవర్ధన్, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో 13, 36వ వార్డు కౌన్సిలర్లు శంకర్రావు, పంపరి లత పాల్గొన్నారు.
కామారెడ్డి మండలంలోని గర్గుల్, ఉగ్రవాయి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో నాగేశ్వర్ పరిశీలించారు. సర్పంచులు రవితేజాగౌడ్, జూకంటి సుమిత, పంచాయతీ కార్యదర్శులు సాగర్గౌడ్, బాలు పాల్గొన్నారు.బీబీపేట్ మండలంలోని యాడారంలో సర్పంచ్ వెంకట్రావు, ఎంపీటీసీ రవి, కార్యదర్శి బాలకృష్ణాగౌడ్ మొక్కలకు నీళ్లు పట్టారు. అనంతరం ఎస్సీవాడలో శ్రమదానం నిర్వహించారు. పల్లెప్రగతిలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని ఎంపీడీవో నారాయణ కార్యదర్శులకు సూచించారు.బాన్సువాడ మండలంలోని బోర్లంలో పల్లెప్రగతి పనులను ఎంపీపీ దొడ్ల నీరజ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ సరళ, ఎంపీటీసీ శ్రావణి పాల్గొన్నారు. బీర్కూర్ తండాలోని పల్లె ప్రకృతి వనాన్ని గ్రామ ప్రత్యేకాధికారి శ్రావణ్కుమార్ పరిశీలించారు.