నిజాంసాగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఎంపీ బీబీపాటిల్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి బుధవారం చేపపిల్లలను విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఈ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి ఉండడంతో 48 లక్షల బొచ్చ, రో, మృగాల జాతీరకాలకు చెందిన 5 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. లాభసాటి సాగుతో పాటు మార్కెటింగ్ సొసైటీలను బలోపేతం చేస్తే దళారులను ఆశ్రయించకుండా మద్దతు ధర వచ్చేలా విక్రయించుకుంటారని అన్నారు.
ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ ..ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెడుతుందని వెల్లడించారు. మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యానాయక్, ఎంపీపీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి, ఏడీ శంకర్రాథోడ్, డీఎఫ్వో వెంకటేశ్వర్రావ్, ఎఫ్డీవో డోలిసింగ్, నాయకులు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహార్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తాసీల్దార్ నారాయణ, ఎంపీడీవో పర్బన్న మత్స్యకార్మిక నాయకులు నామాల శంకర్, రాములు తదితరులు ఉన్నారు.