కామారెడ్డి : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రైతు బాంధవుడని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ (Mla Surendar) అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ గురువారం నుంచి ప్రారంభం కావడంతో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం రైతులతో కలసి భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు (Farmers) అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టడం లేదని పేర్కొన్నారు.
రైతు బంధు,రైతు బీమా,ఉచిత విద్యుత్, రుణమాఫీ,సాగు నీరు,పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలతో తెలంగాణలో వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చిన కేసీఆర్కు రైతులతో కలిసి ధన్యవాదాలు తెలిపారు.రూ.19 వేల కోట్లతో రుణమాఫీ చేయడం పట్ల సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.