నిజామాబాద్/విద్యానగర్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు కాబోతున్నది. ఈ మేరకు శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానున్న పురపాలక పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం వెలువడనున్నది. కౌన్సిల్ సమావేశంపై మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, కమిషనర్ గంగాధర్ పేరిట ప్రకటన సైతం విడుదలైంది. ఇందులో ఏకైక ఎజెండాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు అంశాన్నే పేర్కొన్నారు. కొంత కాలంగా రైతుల్లో తీవ్రమైన అపోహలను కొంత మంది వ్యక్తులు సృష్టించడం ద్వారా ఆందోళనకు గురయ్యారు. తమ వ్యవసాయ పొలాలను నష్ట పోతున్నట్లుగా రైతులు భ్రమపడుతుండడంతో చివరికి కర్షకులకు ఇక్కట్లు కలుగకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్న ది. ఉదయం 11.30 గంటలకు సమావేశం కాను న్న పాలకవర్గ సమావేశానికి నిట్టు జాహ్నవి అధ్యక్షత వహిస్తారు. మొత్తం మంది కౌన్సిలర్లు ఈ అత్యవసర మీటింగ్కు హాజరు కాబోతున్నారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు కౌన్సిల్ ఆదేశాలకు విరుద్ధంగా డ్రాఫ్ట్ను తయారు చేసి గందరగోళాన్ని సృష్టించిన ఏజెన్సీపై చర్యలకు పాలకవర్గం ఉపక్రమించబోతున్నది.
డిజైన్ డెవలప్మెంట్ ఫోరంపై చర్యలు…
2021 మార్చి 27న కామారెడ్డి పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. కామారెడ్డి పట్టణాభివృద్ధి దృష్ట్యా బృహత్ పట్టణ ప్రణాళిక ముసాయిదాను ఆమోదించారు. ఈ ఆమోదిత తీర్మానాన్ని ప్రభుత్వానికి సైతం పంపించారు. కౌన్సిల్ నిర్ణయించిన ముసాయిదాను మాస్టర్ ప్లాన్ను ఢిల్లీకి చెందిన డిజైన్ డెవలప్మెంట్ ఫోరంతో పాటు డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ రమేశ్ బాబు మార్పులు చే శారు. నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిల్లో ఆమోదించిన మాస్టర్ ప్లాన్కు బదులుగా వేరే ముసాయిదాను సర్కారుకు చేర్చడంతో క్షేత్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ముసాయిదా బయటికి వచ్చింది. తద్వారా ముసాయిదాలో పేర్కొన్న పలు అంశాలు బయటికి రావడంతో రైతులు, పట్టణ ప్రజలంతా తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. డీటీసీపీ ఉన్నతాధికారుల తీరుతో ఏర్పడిన సందిగ్ధతతో రైతులంతా అయోమయానికి గురవ్వడంతో పాటు తమ వ్యవసాయ పొలాలన్ని ఇండస్ట్రీయల్ జోన్ పరిధిలోకి వెళ్తాయంటూ భ్రమ పడ్డారు. ఈ లోపాలకు కారణమైన డిజైన్ డెవలప్మెంట్ ఫోరంతో పాటు డీటీసీపీ బాధ్యులపై చర్య లు తీసుకోవాలని ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం చేసి పంపించనున్నట్లుగా తెలిసింది.
రైతును అడ్డం పెట్టి…
సందట్లో సడేమియా మాదిరిగా ప్రతిపక్ష పార్టీలు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను అడ్డం పెట్టుకొని తమ స్వార్థ రాజకీయానికి తెర లేపాయి. ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లడించకుండా రైతులను రోడ్డుపైకి పట్టుకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలతో పాటు హింసాత్మక ఘటనల్లో పాత్రధారులను చేసింది. అమాయక రైతులను ముందు పెట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన చిల్లర రాజకీయంపై స్థానికంగా ప్రజలంతా దుమ్మెత్తి పోశారు. నిత్యం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, వారిలో లేనిపోని భయాలను కల్పించడం ద్వారా అమాయ క రైతన్నలంతా గందరగోళానికి గురి కావాల్సి వ చ్చింది. బాధ్యతగల బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మాస్టర్ ప్లాన్పై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించింది. ప్రతి అంశంపై స్పందించి చివరికి ప్రజల మేలును ఆకాంక్షించి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దుకు నిర్ణయం తీసుకుంది. పొలాలను ప్రభుత్వం లాక్కుంటుందంటూ ప్రచారం వ్యాప్తి చెందడంతో రైతులంతా గందరగోళానికి గురయ్యారు. ఈ విషయంపై పురపాలక శాఖ స్పందించి రైతులు, పట్టణ వాసుల నుంచి అభ్యంతరాలను, సలహాలు, సూచనలను స్వీకరించింది. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని కౌన్సిల్ బాధ్యులంతా వెల్లడించారు.
శరవేగంగా అభివృద్ధి…
కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తున్నది. ఒకప్పుడు చిన్నపాటి పట్టణంగానే కొనసాగిన కామారెడ్డిని స్వరాష్ట్రంలో నలువైపులా అభివృద్ధి చేసింది. మున్సిపల్ శాఖ ద్వారా రూ.వందల కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలను కల్పించింది. 2019లో కామారెడ్డి పురపాలక సంఘాన్ని ప్రభుత్వం విస్తృతం చేసింది. 11 గ్రా మాలను విలీనం చేసి పరిధిని పెంచింది. విలీన గ్రా మాల్లో రూ.కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలను పెంచింది. ఎనిమిదేండ్ల క్రితం నాటికి ఇప్పటికీ బహుళ మార్పులతో కామారెడ్డి పట్టణం రూపురేఖలు సంపూర్ణంగా మారిపోయా యి. అంతేకాకుండా ప్రజల అవసరాలు, డిమాండ్లకు తగ్గట్లుగా కామారెడ్డి జిల్లాగా మారింది. తద్వారా అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు సుపరిపాలన దిశగా సాగుతున్న తెలంగాణ సర్కారు పరిపాలనలో కామారెడ్డి ద్వితీయ శ్రేణి పట్టణం వృద్ధిలో దూసుకుపోతున్నది.