ఇందూరు, అక్టోబర్ 11 :వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం వివిధ శా ఖల అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈవోలు, ఐకేపీ సీసీలు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రై తు ఏ దశలోనూ ఇబ్బందులకు గురి కాకుండా పూ ర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. తరుగు, కడ్తా పేరుతో నష్టపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్ర భుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్ద తు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులు, సొసైటీల చైర్మన్లు, సీఈవోలదేనని స్పష్టం చేశారు. గతేడాది 3.90 లక్షల ఎకరాల్లో వరి పండించగా, ఈసారి 4.18 లక్షల ఎకరాలకు పెరిగినందున పెద్ద ఎత్తున దిగుబడులు వస్తాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లు, స్థలాలను సిద్ధం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సారి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని, క్వింటాలుకు రూ.1900 వరకు ధర లభిస్తుందన్నా రు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే ప్రైవేట్ వ్యాపారులను సైతం ప్రోత్సహించాలన్నారు. ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా గన్నీ బ్యాగ్లను సమకూరుస్తున్నామన్నారు.కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్మిల్లులు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎస్వో చంద్రప్రకాశ్, డీసీవో సింహాచలం, డీఏవో తిరుమల ప్రసాద్, డీటీసీ వెంకటరమణ, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగుబాయి పాల్గొన్నారు.