కామారెడ్డి, సెప్టెంబర్ 11 : జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు కమ్యూనిటీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సమీఉల్లా ఖాన్, షేక్ అలీమోద్దీన్, షేక్ అబ్దుల్ లతీఫ్, విజయ్ కుమార్, నిర్మల, స్వప్న, కమ్యూనిటీ మెడిటేషన్ వలంటీర్లు పాల్గొన్నారు.