కామారెడ్డి, జూలై 21 : కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులను ప్రజలు ఆన్లైన్లో నమోదు చేసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం జిల్లా కోర్టు ప్రాంగణంలో తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.
ఈ కేంద్రాన్ని న్యాయవాదులు, కోర్టు, పోలీసు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు, కక్షిదారులు, సాధారణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ప్రభు త్వ న్యాయవాది శ్యామ్ గోపాల్ రావు, తహసీల్దార్ హిమబిందు, కోర్టు ప్రధాన పరిపాలనాధికారి రాంచదర్, సూపరింటెండెంట్ భుజంగరావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్రెడ్డి, పారా లీగల్ వలంటీర్ విజయ్ కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.