కంఠేశ్వర్, జనవరి 22: నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమల్ల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న ఉపాధి కల్పనా కార్యాలయంలో మేళా ఉంటుందని పేర్కొన్నారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉద్యోగ మేళాలో పాల్గొనాలని సూచించారు. వివరాలకు 9581768413, 99487 48428 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.