సిరికొండ, జనవరి 28: థాయిలాండ్లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్నగర్ పంచాయతీ పరిధిలోని లొంక తండాకు చెందిన బదావత్ వినోద్ నాయక్ రజత పతకం సాధించాడు.
భారత దేశానికి రజత పతకం సాధించినందుకు చాలా గర్వపడుతున్నానని వినోద్నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.