కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 1: ఉమ్మడి జిలాల్లో ఇంటర్ ప్రాకి క్ట ల్ పరీక్షలు గురువార0 నుంచి ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 53, నిజామాబాద్లో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు జనరల్ 605 మందికి విద్యార్థులకు 584 మంది, వొకేషనల్ 781 మందికి 708 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు జనరల్ 379 మందికి 365 మంది, వొకేషనల్ 691 మందికి 665 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
నిజామా బా ద్ జిలాల్లో ఉదయం జరిగిన ప్రాకిక్టల్ పరీక్షలకు జనరల్ మొత్తం 1045 మంది విద్యార్థులకు 1002 మంది , మధ్యాహ్నం 689 మందికి 664 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. వొకేషనల్లో మొత్తం 1372 మంది విద్యార్థులకు 1170 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఇంటర్ విద్యాధికారితోపాటు పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు.