ఇందూరు, జూలై 19 : జిల్లా కేంద్రంలోని కసాబ్గల్లీలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు. అందంగా బోనాలను అలంకరించి ఊరేగింపుగా డప్పుల దరువుల మధ్య పోచమ్మగల్లీలోని పోచమ్మగుడి వద్దకు వెళ్లారు.
కార్యక్రమంలో నగర ఆరె కటికె సంఘం అధ్యక్షుడు డిబ్బికార్ సయ్యాజీ, బోగికార్ సయ్యాజీలాల్, ఆరె కటికె సంఘం సభ్యులు పాల్గొన్నారు.