నందిపేట్, జనవరి 1: ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి కల్యాణ మండపాల ప్రదాత అని నందిపేట్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నందిపేట్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. షాదీఖానాకు రూ.50లక్షలు మంజూరు చేసిన జీవన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మండలంలోని మున్నూరుకాపు, పద్మశాలీ, ముస్లిముల కోసం ప్రత్యేక కల్యాణ మండపాల నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముస్లిము కమిటీ అధ్యక్షుడు అహ్మద్ఖాన్ మాట్లాడుతూ ఇటీవల ముస్లిము కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యే జీవన్రెడ్డికి షాదీఖానాపై వినతిపత్రం ఇవ్వగా స్పందించి ఇంత త్వరగా మంజూరు చేయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు పాషా మాట్లాడుతూ ముస్లిములంతా ఎమ్మెల్యే జీవన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో గ్రామ మజీద్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.