ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పద్మశాలీ కుల సంఘ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.