ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమంతుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, హన్మంత్ షిండే ఆంజనేయుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ భక్తులు ప్రధాన వీధుల్లో భారీగా శోభాయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. నిజామాబాద్లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా హనుమాన్ భక్తులకు అల్పాహారం, పండ్లు, తాగునీటిని ఏర్పాటు చేశారు. గాంధీచౌక్ వద్ద ముస్లిములు పండ్లను పంపిణీ చేశారు. అన్ని హనుమాన్ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.