కోటగిరి/బాన్సువాడ/మాక్లూర్, అక్టోబర్ 27 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన రెడ్డికా కులస్తులు సుమారు వందమంది ప్రత్యేకంగా బస్సులో బాన్సువాడకు వెళ్లి స్పీకర్కు ఏకగ్రీవ తీర్మాన కాపీని శుక్రవారం అందజేశారు. అదే విధంగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు, బాన్సువాడ పట్టణానికి చెందిన పద్మశాలీ సంఘం సభ్యులు స్పీకర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసి అందజేశారు. స్పీకర్ను కలిసిన వారిలో ఎత్తొండ ఎంపీటీసీ అగ్గు కల్పనా హన్మంతు, గుంజరి కిష్టయ్య, గంగొల్ల స్వామి, బొర్రొల గోపి, బుడ్డోల అశోక్, బుడ్డోల మనోహర్, శివరాం గోపి, పెద్దోల్ల లింగారెడ్డితో పాటు సోంపూర్ ఎంపీటీసీ అనంత విఠల్ ఉన్నారు.
మాక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామంలోని గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు వైస్ ఎంపీపీ సుక్కి సుజాత ఆధ్వర్యంలో తీర్మాన పత్రాన్ని శుక్రవారం అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్, జీవన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని, అభివృద్ధికి ఆకర్షితులై మద్దతు తెలుపుతున్నామన్నారు.