డిచ్పల్లి, డిసెంబర్3 : మండలంలోని ముల్లంగిలో అయ్యప్ప మహా పడిపూజను శనివారం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప శరణుగోషతో గ్రామం మార్మోగింది. అయ్యప్పస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జై శబరీశ్వర భజన బృందం చేసిన భజన, ప్రముఖ జానపద గాయకుడు జంగిరెడ్డి గురుస్వామి, రేలారే రేలా ఫేమ్ గంగ పాడిన భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శక్కరికొండ కృష్ణ, సర్పంచ్ పాశం లావణ్యామధుసూదన్, ఎంపీటీసీ సభ్యుడు నర్సయ్య, ఉపసర్పంచ్ మురళి, గురుస్వాములు, మాలధారులు పాల్గొన్నారు.
ఇందల్వాయిలో ఆరట్టు..
ఇందల్వాయి, డిసెంబర్ 3 : మండలంలోని నల్లవెల్లి గ్రామంలో అయ్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో ఆరట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ అయ్యప్ప పాటలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలో అయ్యప్ప మహా పడిపూజను ఆదివారం నిర్వహించనున్నట్లు మాలధారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నోముల విజయా లక్ష్మారెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, గురుస్వాములు గంగారెడ్డి, రాజేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, మాలధారులు పాల్గొన్నారు.