కంఠేశ్వర్, ఏప్రిల్ 14 : తమిళనాడు రాష్ట్రంలోని అలకగపురం, సేలంలో ఉన్న సెయింట్ జాన్స్ మెట్రిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఈనెల 13, 14వ తేదీల్లో నిర్వహించిన సీనియర్ ఇంటర్జోన్ జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మహిళల విభాగంలో గుగులోత్ మమత (సౌత్ జోన్ కెప్టెన్), లకావత్ రాణి, పురుషుల విభాగంలో గుండా వినయ్ సౌత్జోన్ జట్టు తరఫున పాల్గొన్నారు. మహిళల జట్టు వెస్ట్జోన్ జట్టుపై 5-0 తేడాతో, పురుషుల జట్టు వెస్ట్జోన్ జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి,
బంగారు పతకాలు అందుకున్నట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, మర్కంటి గంగామోహన్ ఆదివారం తెలిపారు. పథకాలు సాధించిన క్రీడాకారులను సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎల్ఆర్ మౌర్య, సీఈవో ప్రవీణ్ అనౌకర్, జిల్లా సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల స్సోర్ట్స్ కో-ఆర్డినేటర్ నీరజారెడ్డి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా సాఫ్ట్ బాల్ అసొసియేషన్ సంయుక్త కార్యదర్శులు సుజాత, చిప్ప నవీన్, సొప్పరి వినోద్, నల్లూరి లత, పవన్, కోచ్లు నరేశ్, వేముల మౌనిక తదితరులు అభినందించారు.