ముప్కాల్, జనవరి 23: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ జలాశయాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ సీఈ హైడ్రాలజీ ఆధ్వర్యంలో కాకతీయ, సరస్వతీ, లక్ష్మి, వరద కాలువలతోపాటు గోదావరి నదిపై ఉన్న సోన్ బ్రిడ్జి వంతెనను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా విడుదలవుతున్న నీటి వివరాలను సేకరించేందుకు గేజ్ స్టేషన్స్, ఆటోమెటిక్ వాటర్ లెవల్స్, రికార్డింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేసినట్లు డీఈ గణేశ్ తెలిపారు. కార్యక్రమంలో జీఆర్ఎంబీ సభ్యులు రాజీవ్ కుమార్, ఎస్ఈ ప్రసాద్, ఈఈ రమణ మూర్తి, ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.