బిచ్కుంద, మే11: బాలికపై వేధింపులకు పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. బి చ్కుందలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మా ట్లాడారు. కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బాధిత కుటుంబం పై బెదిరింపులకు పాల్పడడం దారుణమ ని మండిపడ్డారు.
తన కొడుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడితే బండి సం జయ్ మౌనంగా ఉండడం సిగ్గుచేటని, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యా యం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే.. బాధితుల పక్షాన ఉం డాల్సిన పోలీసులు నిర్లక్ష్యం చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిందితుడిపై పోక్సో కేసు చట్టం కింద కేసు నమోదు చేసినా పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా, 48 గంటలు గడుస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కేంద్ర హోం శాఖ సహయ మం త్రిగా ఉన్న బండి సంజయ్ ప్రభావం ఈ కేసుపై పడే అవవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నందున, విచారణ నిష్పాక్షపతంగా జరగాలంటే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని సూచించా రు.
ఆయన రాజీనామా చేయకపోతే ప్రధాని మోదీ స్పందించి సంజయ్ను బర్తరఫ్ చేసి, బాలికకు న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్న బండి సంజయ్ను నిందితుడిగా లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఒక బాలికపై అ ఘాయిత్యం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. సీఎం, హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.