ధర్పల్లి, జనవరి 29 : మండలంలోని బంజారా సేవా సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ను ఆదివారం కలిశారు. బంజారా సేవా సంఘం సమితి ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం రూ. 10 లక్షలను ఎమ్మెల్యే మంజూరు చేశారు. అనంతరం సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. అడిగిన వెంటనే బంజారా సేవా సంఘానికి రూ. 10 లక్షలు అందజేసిన ఎమ్మెల్యేకు మండల బంజారా సేవా సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బంజారా సేవా సంఘం నాయకులు శ్రీనివాస్నాయక్, శంకర్నాయక్, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం
డిచ్పల్లి, జనవరి 29 : జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ (మద్వరాయలగుట్ట) గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ను ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆహ్వానపత్రికను బాజిరెడ్డి గోవర్ధన్కు ఆదివారం అందజేశారు. ఫిబ్రవరి 2 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్, కొలిప్యాక్ దేవాదాయ శాఖ అధ్యక్షుడు లచ్చీరాం, ఉపాధ్యక్షుడు రవి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలయ్య, వీడీసీ ఉపాధ్యక్షుడు సంతోష్ ఆహ్వానపత్రికను అందజేశారు.
ఆర్టీసీ చైర్మన్ను కలిసిన నాయకులు
సిరికొండ/ డిచ్పల్లి, జనవరి 29 : సిరికొండ మండలంలోని కుర్దుల్పేట్ గ్రామస్తులు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం కలిశారు. కుర్దుల్పేట్ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి, గ్రామ పంచాయతీ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ద్యాగ గంగాధర్, ఎంపీటీసీ సభ్యుడు గాండ్ల సతీశ్, చిన్నోళ్ల గంగాధర్, బుచ్చన్న, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్ గ్రామంలో నిర్మించ తలపెట్టిన రెడ్డి సంఘం భవనానికి నిధులు మంజూరు చేయాలని బర్ధిపూర్ రెడ్డి సంఘం ప్రతినిధులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి విన్నవించారు. ఇందుకు బాజిరెడ్డి గోవర్ధన్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు కిష్టారెడ్డి, రైతుబంధు సమితి మండల సభ్యుడు నీరడి పద్మారావు, ఉపసర్పంచ్ గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, విండో డైరెక్టర్ సుధాకర్రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు కేశారం శ్రీనివాస్రెడ్డి, రాము పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇందల్వాయి, జనవరి 29 : మండలంలోని లోలం గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్గౌడ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఇందల్వాయి జడ్పీటీసీ సభ్యురాలు గడ్డం సుమనారవిరెడ్డి, ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, రైతుబంధు సమితి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.