నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 23 : నగరశివారులోని గూపన్పల్లి గ్రామంలో నేషనల్ అండ్ తెలంగాణ స్టేట్ డిజాస్ట్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్నిప్రమాద సంఘటనలు, భవనాలు కూలినప్పుడు, కెమికల్స్ లీకేజీ అయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు, మెళకువలపై అవగాహన కల్పించి, డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో విజయవాడ 10వ బెటాలియన్కు చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 20 మంది, తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ స్టేషన్ సిబ్బందితో కలిసి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్వైస్ వలంటీర్లు, ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) కమాండెంట్ ఇన్స్పెక్టర్ బెటన్సింగ్ తెలిపారు. జనవరి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్కుమార్, గిర్దావర్ హరీశ్రెడ్డి, రూరల్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో లింబాద్రి, కార్పొరేటర్ చిటికెల శ్రీనివాస్రెడ్డి, అగ్నిమాపక శాఖాధికారి నర్సింగ్రావు, లీడింగ్ ఆఫీసర్ ఏసురత్నం, డీఏపీ శ్రీనివాస్, ఫైర్ ఫైటర్లు ఎండి.నజీమ్, నెహ్రూ, ఎన్డీఆర్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నర్సింహారావు, కానిస్టేబుళ్లు వెంకటేశ్, ఈశ్వర్రావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.