మోస్రా (చందూర్), డిసెంబర్ 25 : మోస్రా మండలంలోని చింతకుంట గ్రామంలో శాంతినగర్ (పీఎస్ఆర్) నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో సొంతింటి కల నెరవేరే దిశగా 36 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
చింతకుంట గ్రామానికి మొత్తం 70 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా.. 34 మంది లబ్ధిదారులు వారి సొంత స్థలాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసుకోగా.. మిలిగిన వారికి శాంతినగర్ కాలనీలో ఇండ్లను నిర్మించి ఇవ్వడంపై నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి కృషిచేసిన స్పీకర్కు సర్పంచ్ విమలా లింగయ్య కృతజ్ఞతలు తెలిపారు.